హైదరాబాద్, ఆట ప్రతినిధి: సింగపూర్ వేదికగా జరుగుతున్న బైంకా పనోవ ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో రాష్ట్ర యువ జిమ్నాస్ట్ అంజన గునుకుల మూడు పతకాలతో జోరు కనబరిచింది. బుధవారం మొదలైన టోర్నీలో మహిళల వ్యక్తిగత హుప్, బాల్, ఆల్రౌండ్ విభాగాల్లో అంజన పతకాలు దక్కించుకుంది. మొత్తం 18 దేశాలకు చెందిన 209 మంది జిమ్నాస్ట్లు పోటీపడుతున్న టోర్నీలో అంజన సత్తాచాటింది.