Prithvi Shaw | సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ (Social media influence), భోజ్పురి (Bhojpuri actress) నటి సప్నా గిల్ (Sapna Gill ).. క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పృథ్వీ షా-సప్నా గిల్ మధ్య సెల్ఫీ వివాదం (Selfie Case) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో అరెస్టైన సప్నా గిల్కు ముంబై కోర్టు (Mumbai Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన ఆమె.. పృథ్వీషాపై తిరిగి కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్పోర్ట్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గత వారం ముంబైలోని ఓ హోటల్ వద్ద సెల్ఫీలు ఇచ్చేందుకు పృథ్వీ షా నిరాకరించడంతో.. సప్నా గిల్ తన మిత్రులతో కలిసి క్రికెటర్పై అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారులో ఆ క్రికెటర్ను వెంటాడి మరీ .. బ్యాట్లతో దాడికి ప్రయత్నించారు. క్రికెటర్ నుంచి రూ. 50 వేల డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వప్నా గిల్ సహా ఎనిమిది మందిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కూడా. అయితే ముంబై కోర్టు సోమవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన గిల్.. పృథ్వీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.