బెంగళూరు: స్టార్ రైడర్ పవన్ షెరావత్ (19 పాయింట్లు) విజృంభణ కొనసాగుతుండటంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బెంగళూరు బుల్స్ టాప్లో దూసుకెళ్తున్నది. శుక్రవారం జరిగిన పోరులో బెంగళూరు బుల్స్ 46-37తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. తాజా సీజన్లో పాయింట్ల ప్రవాహం కొనసాగిస్తున్న పవన్ వీరవిహారం చేయగా.. అతడికి భరత్ (9) సహకరించాడు. గుజరాత్ తరఫున రాకేశ్ (14) ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్పాంథర్స్ 38-28 పట్నా పైరెట్స్పై గెలిచింది. జైపూర్ తరఫున దీపక్ హుడా (10) రాణించగా.. పట్నా తరఫున మోనూ గోయత్ (7), ప్రశాంత్ (6) పోరాడారు.