బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన టైటాన్స్..మంగళవారం పాట్నా పైరెట్స్తో జరిగిన మ్యాచ్లో 30-21తేడాతో ఘన విజయం సాధించింది. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన టైటాన్స్ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంటూపోయింది. స్టార్ రైడర్లు మోనూ గోయత్(10), సిద్దార్థ్ దేశాయ్(7) మెరుపు రైడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్లు సుర్జీత్సింగ్(4), పర్వేశ్(2) రాణించారు. మరోవైపు పాట్నా జట్టులో సచిన్(6), రోహిత్(5), సునీల్(4) ఆకట్టుకున్నా జట్టును గెలిపించలేకపోయారు.