బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ.. రంజీ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బెంగాల్ మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ తివారీ (136; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు. ఫలితంగా బెంగాల్ జట్టు దేశవాళీ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. జార్ఖండ్తో శుక్రవారం ముగిసిన పోరులో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మునుపెన్నడూ లేని విధంగా వరుసగా తొమ్మిది మంది బెంగాల్ ఆటగాళ్లు అర్ధ శతకాలు నమోదు చేయడంతో తొలి ఇన్నింగ్స్ను 773/7 వద్ద డిక్లేర్డ్ చేసిన బెంగాల్.. జార్ఖండ్ను 298 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 318/7 వద్ద నిలిచింది.