న్యూఢిల్లీ: భారత జట్టు చీఫ్ కోచ్ బాధ్యతలు చేపట్టాలంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను ఓ బీసీసీఐ అధికారి ఆశ్రయించినట్లు వచ్చిన వార్తలను జే షా(Jay Shah) ఖండించారు. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి జే షా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్కు వారసుడిగా భారతీయుడే ఎంపిక అవుతారని ఆయన పేరన్కొన్నారు. దేశంలో క్రికెట్పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తే ఆ బాధ్యతలు చేపట్టనున్నట్లు షా తెలిపారు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ బాధ్యతలు టీ20 వరల్డ్కప్తో ముగియనున్నాయి. అయితే ఆ పాత్రలో కొనసాగేందుకు ఆయన ఆసక్తిగా లేరు. నేను కానీ, లేక ఇతర బీసీసీఐ అధికారి కానీ .. ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆశ్రయించలేదని, మీడియాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని షా తెలిపారు. ఐపీఎల్లో కోచింగ్ బాధ్యతలు చేపడుతున్న ఆసీస్ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు .. భారత హెడ్కోచ్ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఓ బీసీసీఐ అధికారి దీని గురించి తనను అప్రోచ్ అయినట్లు కూడా రికీ పాంటింగ్ ఓ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జే షా ఆ అంశంపై ప్రకటన చేశారు.