కోల్కతా: లెజెండ్స్ లీగ్లో పాల్గొనే భారత జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. ఈ యేడాది లెజెండ్స్ లీగ్లో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రత్యేక మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్కు ఇండియా మహరాజాస్కు గంగూలీ, వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథులుగా వ్యవహరించనున్నారు.
లెజెండ్స్ లీగ్ రెండో యేడాది మ్యాచ్లు సెప్టెంబర్ 17 నుంచి మొదలవుతాయి. ఈ యేడాది లీగ్ను స్వాంతత్య్ర వజ్రోత్సవాలకు అంకితం చేస్తున్నట్టు లీగ్ కమిషనర్ రవి శాస్త్రి తెలిపాడు. గత యేడాది మూడు జట్లతో లీగ్ ను నిర్వహించగా ఈసారి నాలుగు జట్లతో ఫ్రాంచైజీ ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. 22 రోజులపాటు సాగే ఈ లీగ్లో నాలుగు జట్లు మొత్తం 15 మ్యాచ్లు ఆడనున్నాయి.