Roger Binny : బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నివివాదంలో చిక్కుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిన్నికి బీసీసీఐ ఎథికల్ ఆఫీసర్ వినీత్ శరణ్ నోటీసులు పంపించాడు. తనపై వచ్చిన ఆరోపణలకు డిసెంబర్ 20వ తేదీ లోపు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని బిన్నిని ఆదేశించాడు. బిన్ని తన కోడలు మయంతి లంగర్ను స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్గా నియమించాడని, ఆ నెట్వర్క్కు టీమిండియా మీడియా హక్కులు ఉన్నాయని మధ్య్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్త ఫిర్యాదు చేశాడు. దాంతో, బీసీసీఐ నియమాల్ని ఉల్లంఘించినందుకు ఎథికల్ ఆధికారి బిన్నికి నోటీసులు జారీ చేశాడు.
రోజర్ బిన్ని1983 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఏడాది అక్టోబర్లో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీపై కూడా సంజీవ్ గుప్తా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు వేశాడు.