BCCI : ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లు మరితంగా గాయపడకుండా చూడాలనే ఉద్దేశంతో రీప్లేస్మెంట్ ప్లేయర్ను అనుమతించేందుకు బోర్డు పచ్చజెండా ఊపింది. అంతేకాదు షార్ట్ రన్ (Short Run)పై, రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాటర్లపై, వన్డే మ్యాచ్లో రెండు బంతుల వినియోగంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
మామూలుగా టీ20ల్లో.. ముఖ్యంగా ఐపీఎల్లో వికెట్లు పడుతుంటే ప్రధాన బ్యాటర్లు ఓవర్ చివరి బంతికి చివర సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తారు. టెయిలెండర్లు వికెట్ కాచుకోలేరు, బౌండరీలు బాదలేరు కాబట్టి వాళ్ల బదులు స్ట్రయిక్ తీసుకోవాలని కష్టమైనా సరే రెండు రన్స్ తీస్తుంటారు. ఈ క్రమంలో కావాలనే కొందరు నాన్ స్ట్రయికింగ్ క్రీజులో బ్యాటు పూర్తిగా పెట్టరు. దీన్నే షార్ట్ రన్గా పరిగణిస్తారు. ఇకపై షార్ట్ రన్ తీసి బ్యాటింగ్ చేద్దామనుకుంటే కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగానే షార్ట్ రన్ తీస్తే.. స్ట్రయికింగ్లో ఎవరు ఉండాలో ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ నిర్ణయించేలా కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.
🚨 NEW RULE 🚨
BCCI introduces ‘Serious Injury Replacement’ rule for 2025-26 season in multi-day formats, allowing a like-for-like replacement – somewhat similar to concussion replacement – in case of a major injury to any player.#CricketTwitter pic.twitter.com/C9WGOEHyh9
— Cricbuzz (@cricbuzz) August 16, 2025
ఐసీసీ ఈమధ్య వన్డేల్లో రెండు బంతుల నియమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ కూడా ఇదే విధానాన్ని అనుసరించనుంది. ఇకపై వన్డే మ్యాచుల్లో 34 ఓవర్ల తర్వాత ఒకే బంతిని మార్చేందుకు అనుమతించనుంది. త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) నుంచే ఈ నియమం అమల్లోకి వస్తుందని బీసీసీఐ వెల్లడించింది.
అంతేకాదు ఎవరైనా రిటైర్డ్ హర్ట్గా డగౌట్కు వెళ్తే వాళ్లను మళ్లీ మైదానంలోకి అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే.. క్లాజ్ 25.4.2 ప్రకారం రిటైర్డ్ హర్ట్ అయినవాళ్లకు వెసులుబాటు ఉంటుందని బోర్డు చెప్పింది. మామూలుగా అయితే రిటైర్డ్ హర్ట్ అయిన వాళ్లు ఇన్నింగ్స్ మధ్యలో లేదా చివర్లో బ్యాటింగ్కు వస్తుంటారు. కానీ, ఈ కొత్త నిబంధన రాకతో ఇకపై ప్రత్యర్థి కెప్టెన్ అనుమతించినా సరే వాళ్లు మైదానంలోకి వచ్చేందుకు రిఫరీ ఓకే చెప్పరు. ఈ నియమం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని బీసీసీఐ తెలిపింది.