హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడా మౌలిక వసతుల కల్పనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఎల్బీ స్టేడియంలో నెలకొన్న సమస్యలను మంత్రి పరిశీలించారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త కోర్టును ఏర్పాటు చేయడంతో పాటు స్కేటింగ్ రింక్ పునరుద్ధరణపై పలు సూచనలు చేశారు. ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్లతో పాటు తల్లిదండ్రులు, కోచ్లు ప్రాక్టీస్కు రింక్ ఏమాత్రం అనుకూలంగా లేదని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రింక్ను తీర్చిదిద్దాలని సాట్స్ అధికారులకు ఆయన సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. తర్వాత అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, సాట్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.