BANvsNZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ రెండో వన్డేలో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. 14 ఏండ్ల పాటు దిగ్గజాల వల్ల కూడా కాని రికార్డును సౌమ్య సర్కార్ చెరిపేశాడు. రెండో వన్డేలో భాగంగా 151 బంతుల్లో 22 బౌండరీలు, రెండు భారీ సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ 2009లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా క్రిస్ట్చర్చ్ వేదికగా ముగిసిన మ్యాచ్లో 163 పరుగులు చేశాడు. ఆసియా నుంచి వన్డేలలో కివీస్ గడ్డపై ఇదే అత్యధిక స్కోరు. తాజాగా సర్కార్ దానిని బ్రేక్ చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. నెల్సన్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 291 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌమ్య సర్కార్తో పాటు ముష్ఫీకర్ రహీమ్ (45) కూడా రాణించాడు. అనంతరం భారీ ఛేదనలో కివీస్.. 46.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.
Soumya Sarkar smashes his third ODI century, setting records along the way. This is the highest individual innings by a Bangladeshi batsman against New Zealand and the highest individual score by an opener from the Subcontinent in New Zealand. 💯💥#BCB | #Cricket | #BANvNZ pic.twitter.com/xH1YvHQ7l0
— Bangladesh Cricket (@BCBtigers) December 20, 2023
కివీస్ ఓపెనర్లు విల్ యంగ్ (89), రచిన్ రవీంద్ర (45)లు తొలి వికెట్కు 76 పరుగులు జోడించారు. వన్డౌన్లోకి వచ్చిన హెన్రి నికోలస్ (95) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ టామ్ లాథమ్ (34 నాటౌట్), టామ్ బ్లండెల్ (24 నాటౌట్)లు రాణించారు. ఈ విజయంతో కివీస్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తో గెలుచుకుంది. సిరీస్లో నామమాత్రమైన మూడో వన్డే ఈనెల 23న జరగాల్సి ఉంది.