నేపియర్: న్యూజిలాండ్తో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్లో న్యూజిలాండ్పై టీ20ల్లో గెలువడం బంగ్లాకు ఇదే తొలిసారి.
తొలుత కివీస్ 20 ఓవర్లలో 134/9 స్కోరు చేసింది. షరీఫుల్(3/26), మెహదీహసన్(2/14), రెహమాన్(2/15)రాణించారు. నీషమ్(48) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు బంగ్లా 18.4 ఓవర్లలో 137/5 స్కోరు చేసింది. ఓపెనర్ లిటన్దాస్(42 నాటౌట్), సౌమ్య సర్కార్(22) రాణించారు.