హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢాకా (బంగ్లాదేశ్) వేదికగా జరిగిన 34వ ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ జూనియర్స్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ నైశిక్రెడ్డి, ప్రబీర్ముకేశ్ జోడీ రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో నైశిక్రెడ్డి, ప్రబీర్ ద్వయం 2-6, 3-6తో తవీశ్, ఆర్నవ్ యాదవ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.
టైటిల్ పోరు వరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన నైశిక్ జంట అదే జోరు కొనసాగించలేకపోయింది. ప్రకాశ్ పదుకొనే, రాహుల్ ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లోని పీటర్ బర్వాశ్ టెన్నిస్ అకాడమీలో నైశిక్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు.