తనకు అవకాశం ఉంటే ఆసియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ రెండూ ఆడతానని భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా (Bajrang Punia) వెల్లడించాడు. అయితే ఈ రెండు టోర్నమెంట్ల మధ్య కనీసం గ్యాప్ ఉంటేనే అలా చేయగలుగుతానని చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో సత్తా చాటిన భజరంగ్.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు.
కరోనా కారణంగా వాయిదా పడిన ఆసియన్ గేమ్స్, ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెండూ వచ్చే ఏడాది జరగనున్నాయి. వీటిలో దేనిలో పాల్గొనాలనే నిర్ణయంపై భారత రెజ్లర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే భజరంగ్ (Bajrang Punia) తన అభిప్రాయం వెల్లడించాడు.
‘‘2023 చాలా కీలకమైన ఏడాది. వరల్డ్ ఛాంపియన్షిప్స్లో గెలిచి పారిస్ గేమ్స్కు అర్హత సాధించడంపై ఫోకస్ పెడుతున్నా’’ అని ఈ స్టార్ రెజ్లర్ తెలిపాడు. చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆసియన్ గేమ్స్ను వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.