టోక్యో: ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్లో అతడు 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్కు చెందిన మార్క్ కాల్జౌ చేతిలో ఓడిపోయాడు. ఒక దశలో రెండో గేమ్లో 7-1 లీడ్లోకి దూసుకెళ్లిన ప్రణీత్.. తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయాడు. గ్రూప్ డిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లోనూ ఇజ్రాయెల్ ప్లేయర్ జింబర్మ్యాన్ చేతిలో ఓడిన ప్రణీత్.. తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు.