హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో విశ్వక్రీడల్లో పాల్గొననున్న అథ్లెట్లకు భారత ఒలింపిక్స్ సంఘం (ఐవోఏ) ధ్యానం నాణ్యతను కొలిచే స్మార్ట్రింగ్లను అందించనుంది. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మెడిటేషన్ ట్రాకింగ్ స్టార్టప్ ధ్యాన ఎండీ భైరవ్ శంకర్ కలిసి ఈ ధ్యాన రింగ్కు రూపకల్పన చేశారు. అథ్లెట్లకు ఈ స్మార్ట్రింగ్లను అందించేందుకు ధ్యానతో ఐవోఏ ఒప్పందం చేసుకుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఒత్తిడి జయించేలా ఏకాగ్రతను పెంచుకోవడంలోఈ రింగ్స్ సహాయపడతాయని ఐవోఏ తెలిపింది. అందుకే అథ్లెట్లతో పాటు కోచ్లకు కూడా వీటిని అందిస్తామని ప్రకటించింది. ధ్యానంలో ఎంతసేపు ఏకాగ్రతగా ఉన్నామన్న వివరాలను ఈ స్మార్ట్ రింగ్ తెలియజేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ను రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్కు గోపీచంద్, భైరవ్ శంకర్ సోమవారం అందించారు.