న్యూఢిల్లీ: స్పోర్ట్స్లో అత్యుత్తమ అవార్డు అయిన రాజీవ్ ఖేల్రత్నకు స్టార్ ప్లేయర్స్ కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ పేర్లను ప్రతిపాదించింది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇక మరో ముగ్గురు ప్లేయర్స్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ జెర్రీ చోప్రా, సమీర్ వర్మల పేర్లను అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. 2019 వరల్డ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన సాయి ప్రణీత్.. రాబోయే టోక్యో ఒలింపిక్స్కు మెన్స్ సింగిల్స్ కేటగిరీలో క్వాలిఫై అయిన ఏకైక ప్లేయర్ కావడం విశేషం. ఇక ఈ మధ్య పెద్దగా ఫామ్లో లేకపోయినా 2017లో నాలుగు టైటిల్స్ గెలిచాడు కిదాంబి శ్రీకాంత్. ఇక ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్ మురళీధరన్, పీయూ భాస్కర్ల పేర్లను బాయ్ పంపించింది. మురళీధరన్కు ఇప్పటికే ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు.