నేరేడ్మెట్: వైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు కాదని రాష్ర్టానికి చెందిన యువ పారా అథ్లెట్ ఉయ్యాల మోహనహర్ష నిరూపించాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక పారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో హర్ష రజత పతకంతో కొత్త చరిత్ర లిఖించాడు. పురుషుల టీ47 విభాగంలో బరిలోకి దిగిన హర్ష 11.26 సెకన్ల టైమింగ్తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ యువ అథ్లెట్ను మైత్రా ఫౌండేషన్ సముచిత రీతిలో సత్కరించింది. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ సమక్షంలో మైత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్ కులాశ్.. హర్షను సన్మానించారు. పారా ప్రపంచ చాంపియన్షిప్లో పతకం సాధించిన హర్ష.. అథ్లెట్లకు స్ఫూర్తిదాయకమని అన్నారు.