బీ వినోద్కుమార్కు ఉద్యోగుల వినతి
మల్కాజిగిరి, మార్చి 21: ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి రప్పించేందుకు కృషిచేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు తెలంగాణ నేటివిటీ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర సంఘం నేతలు విజ్ఞప్తిచేశారు. ఆదివారం మినిస్టర్స్ క్వాటర్స్లోని క్యాంపు కార్యాలయంలో వినోద్కుమార్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని మానవతా దృక్పథంతో తెలంగాణకు రప్పించాలని కోరారు.