న్యూఢిల్లీ: భారత అథ్లెట్ అవినాష్ సబ్లే.. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం పోలాండ్లో జరుగుతున్న సిలేసియా డైమండ్ లీగ్లో ఆరో స్థానంలో నిలువడం ద్వారా అవినాశ్ ఈ ఘనత సాధించాడు. ఆదివారం పోటీల్లో అవినాశ్ 8 నిమిషాలా 11 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు.