మెల్బోర్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురయింది. విజయంతో గ్రాండ్స్లామ్ కెరీర్ను ముగించాలనుకున్న ఆమె ఆశలు ఫలించలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీ ఓటమిపాలైంది. ఫైనల్లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో 7-6, 6-2తో సానియా జోడీ ఓటమిచవిచూసింది. దీంతో ఓటమితో టెన్నిస్ కెరీర్కు సానియా వీడ్కోలు పలికినట్లయింది.
సానియా కెరీర్లో ఇది 11వ గ్రాండ్స్లామ్ ఫైనల్. 2009లో మహేశ్ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్స్లామ్ ట్రోఫీ (ఆస్ట్రేలియన్ ఓపెన్) కైవసం చేసుకున్నది. ఆ తర్వాత మరో ఐదు గ్రాండ్స్లామ్ ట్రోఫీలు గెలుపొందింది. వాటిలో రెండు మిక్స్డ్ డబుల్స్, మూడు మహిళ డబుల్స్ ఉన్నాయి. మొత్తంగా ఆమె 43 డబుల్స్ టైటిళ్లను సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాలపాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్లో నంబర్ 1 ప్లేస్లో కొనసాగింది.
కాగా, తన చివరి మ్యాచ్లో ఓటమి చెందడంతో సానియా మీర్జా కన్నీరుపెట్టుకున్నారు. విజయం సాధించిన బ్రెజిల్ జోడీ లూయిసా, రఫెల్ను అభినందించారు.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
BRAZILIAN BREAKTHROUGH 🇧🇷
Rafael Matos & @Luisa__Stefani are the #AusOpen mixed doubles champions 🏆#AO2023 pic.twitter.com/yeYMslxva1
— #AusOpen (@AustralianOpen) January 27, 2023