నాటింగ్హామ్: ఆసీస్ ఆఫ్స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ బంతితో గింగిరాలు తిప్పడంతో మహిళల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. 268 పరుగుల ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 116/5తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. చివరకు 178 పరుగులకు ఆలౌటైంది.
వ్యాట్ (54) టాప్ స్కోరర్ కాగా.. గార్డ్నర్ 8 వికెట్లతో అదరగొట్టింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 12 వికెట్లు తీయడంతో పాటు 40 పరుగులు చేసిన గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 473, ఇంగ్లండ్ 463 పరుగులు చేయగా.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 257 రన్స్ సాధించింది.