కొలంబో: ఇప్పటికే లంకేయుల చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆఖరి వన్డేలో ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన చివరి పోరులో ఆసీస్ 4 వికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.1 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది.
చమిక కరుణరత్నె (75) టాప్ స్కోరర్. కంగారూ బౌలర్లలో కమిన్స్, మాథ్యూ, హజిల్వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 39.3 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. అలెక్స్ కారీ (45 నాటౌట్), లబుషేన్ (31) రాణించారు. లంక బౌలర్లలో దునిత్ 3, తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు.