IND vs AUS : అహ్మదాబాద్లో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఓపెనర్లు రోహిత్ శర్మ (17) , శుభ్మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 444 పరుగులు వెనకబడి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు 480 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. usman khawaja ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఐదో వికెట్కు వీళ్లు 208 పరుగులు చేయడంతో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. ఒకే ఓవర్లో గ్రీన్, అలెక్స్ క్యారీని పెవిలియన్ పంపి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ (34), టాడ్ మర్ఫీ(41) భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. వీళ్లు తొమ్మిదో వికెట్కు 70 రన్స్ కొట్టారు. అశ్విన్ వీళ్లిద్దరి పెవిలియన్ పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. షమీ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు.
ఈమ్యాచ్లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు. ఓవర్నైట్ స్కోర్ 104 రన్స్తో ఖవాజా, గ్రీన్ 49 రన్స్తో రెండో రోజు క్రీజులోకి వచ్చారు. గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన గ్రీన్ టెస్టు ఫార్మాట్లో మొదటి సెంచరీ బాదాడు. 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని అశ్విన్ బోల్తా కొట్టించాడు. నిదానంగా ఆడిన ఖవాజా ఈ క్రమంలోనే 150 మార్క్ అందుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, పది గంటల అతని మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది. 422 బంతులు ఎదుర్కొన్న అతను 21 ఫోర్లు కొట్టాడు.