వెల్లింగ్టన్: బౌలర్లు సమిష్టిగా విజృంభించడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం మూటగట్టుకుంది. కామెరూన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీ బాదడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో హెన్రీ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ 179 పరుగులకే ఆలౌటైంది. ఫిలిప్స్ (71), హెన్రీ (42) కాస్త పోరాడగా.. విలియమ్సన్ (0), రచిన్ (0), లాథమ్ (5), యాంగ్ (9), మిషెల్ (11) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13/2తో నిలిచారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆసీస్ ప్రత్యర్థి కంటే 217 పరుగుల ఆధిక్యంలో ఉంది.