శ్రీలంకతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు విజయం దిశగా సాగుతోంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (27 నాటౌట్) నిదానంగా ఆడుతున్నాడు.
మిచెల్ మార్ష్ (18) గేరు మార్చే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో గ్లెన్ మ్యాక్స్వెల్ (12 బంతుల్లో 23) ధాటిగా ఆడి జట్టుకు ఊపిరి పోశాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టొయినిస్ (12 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. దీంతో ఆ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో నిలిచింది.