ఆస్ట్రేలియాలో పర్యటించిన క్రికెట్ జట్లలో ఇంత వరస్ట్ జట్టును తానెప్పుడూ చూళ్లేదంటూ.. ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మండిపడ్డాడు. ఇంత చెత్తగా ఆడే జట్టు ఎప్పుడూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎన్నడూ రాలేదన్నాడు. ఎంతో హోరాహోరీగా ఉంటుందనుకున్న యాషెస్ సిరీస్.. ఇంగ్లండ్ అత్యంత చెత్త ప్రదర్శనతో ఏకపక్షంగా సాగిన సంగతి తెలిసిందే.
వరుసగా మూడు టెస్టులో కోల్పోయిన ఇంగ్లండ్.. సిరీస్ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది కూడా. ఈ క్రమంలోనే స్పందించిన పాంటింగ్.. ’కొందరు ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాటర్ల టెక్నిక్.. అసలు టెస్టు స్థాయిది కాదు. వాళ్లు ఈ స్థాయిలో నిలబడలేరు‘ అని తేల్చిచెప్పేశాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే.. వాళ్లలో ఎవరికీ బ్యాటింగ్ సరిగా వచ్చినట్లు కనిపిండం లేదని తేల్చేశాడు.
మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ఫర్వాలేదనిపించినా.. వారికి బ్యాటర్ల నుంచి మద్దతు కరువైంది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం ఇవ్వకుండా ఇంగ్లిష్ బౌలర్లు కట్టడి చేశారు. అయితే కంగారూల ముందు భారీ లక్ష్యం ఉంచాల్సిన బ్యాటర్లు 68 పరుగులకే కుప్పకూలి.. మ్యాచ్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.