న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్( Lovlina )కు డీఎస్పీ పోస్ట్ ఆఫర్ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. అంతేకాదు గౌహతిలోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇక ఆమె సొంతూరు గోలాఘాట్లో ఆమె పేరు మీద స్టేడియం కడతామని చెప్పారు. ఆమె కోచ్కు రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. ఒలింపిక్స్లో పెద్దగా అంచనాలు లేకుండా సెమీఫైనల్ వరకూ వెళ్లిన లవ్లీనా.. అందులో ఓడటంతో బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్ బాక్సింగ్లో విజేందర్, మేరీకోమ్ తర్వాత మెడల్ గెలిచిన మూడో బాక్సర్గా లవ్లీనా నిలిచింది.
Assam CM Himanta Biswa Sarma offers the post of DSP to #Tokyo2020 bronze medalist boxer Lovlina Borgohain. A road in Guwahati will be named after the boxer. A stadium will be constructed in her name in her home town Golaghat. Her coach will be given Rs 10 Lakhs.
— ANI (@ANI) August 12, 2021
(File pic) pic.twitter.com/oMUouOYA6I