అస్తానా : ఆసియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ నిషా దహియా స్వర్ణ పోరుకు చేరుకుంది. 68 కిలోల విభాగంలో పోటీపడుతున్న నిషా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన ఫెంగ్ ఝౌను 7-6 తేడాతో ఓడించింది. ఫైనల్లో నిషా ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత, జపాన్కు చెందిన అమి ఇషీతో తలపడుతుంది.