మనామా: భారత యువ వెయిట్లిఫ్టర్ హర్షద గరుడ్ అంతర్జాతీయ టోర్నీ లో మళ్లీ మెరిసింది. ఏషియన్ వెయిట్లిఫ్టింగ్ చాం పియన్షిప్లో హర్షద కాంస్య పతకం దక్కించుకుం ది. శనివారం జరిగిన మహిళల 45కి లోల విభాగంలో హర్షద.. స్నాచ్లో 68కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 84కిలోలు మొత్తంగా 152 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. గత జూలైలో జరిగిన ఆసియా యూత్, ప్రపంచ జూనియర్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీలో కంటే ఐదు కిలోలు తక్కువ ఎత్తిన హర్షద తన గత ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. కోంగ్ మై ప్యూయంగ్(166కి, వియత్నాం), నఫిసతుల్(162కి, ఇండోనేషియా) వరుసగా స్వర్ణ, రజ త పతకాలు కైవసం చేసుకున్నారు. ఏషియన్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీ కోసం భారత్ 13 మందితో కూడిన బృందాన్ని పంపింది.