హైదరాబాద్, ఆట ప్రతినిధి: జోహర్బహ్రు (మలేషియా) వేదికగా ఆసియా క్లాసిక్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన పార్వతి శ్రీరామ్ కాంస్య పతకంతో మెరిసింది. మహిళల 69కిలోల విభాగంలో బరిలోకి దిగిన పార్వతి స్కాట్లో కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో పవర్లిఫ్టింగ్ను కెరీర్గా మొదలుపెట్టిన పార్వతి రాష్ట్ర స్థాయి టోర్నీలో స్వర్ణం సహా జాతీయ పవర్లిఫ్టింగ్ టోర్నీలో రజతం దక్కించుకుంది. స్వల్ప వ్యవధిలోనే పవర్లిఫ్టింగ్లో అంతర్జాతీయ ఎదగడంపై కఠిన శ్రమ దాగుందని ఆమె పేర్కొంది. క్రమశిక్షణకు తోడు సాధించాలన్న పట్టుదలతో తాను ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపింది.