హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఆఖరి నిమిషంలో వివాదాస్పదమైన భారత్, ఇరాన్ మెన్స్ కబడ్డీ ఫైనల్లో ఎట్టకేలకు భారత్నే విజయం వరించింది. చివరి నిమిషంలో ఓ రైడ్కు సంబంధించి అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దాంతో ఇరు జట్లు అంపైర్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో దాదాపు గంటపాటు ఆట నిలిచిపోయింది.
India are clear winners, just the refree does not know the rules
Disgusting #AsianGames #Kabaddi
— Messi fan boy (@iam_prash004) October 7, 2023
జ్యూరీ జోక్యంతో గంట విరామం తర్వాత ఆట మొదలైంది. ఒక సక్సెస్ఫుల్ రైడ్, సూపర్ టాకిల్తో భారత్ నాలుగు పాయింట్లు సాధించి 33-29 తేడాతో భారత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మెన్స్ కబడ్డీ గోల్డ్తో కలిపి భారత్ ఈ ఆసియా క్రీడల్లో మొత్తం 103 పతకాలు సాధించినట్లయ్యింది. అందులో 28 బంగారు పతకాలు, 35 రజత పతకాలు, 45 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇదిలావుంటే ఉమెన్స్ హాకీలో కూడా భారత్కు కాంస్యం దక్కింది. బ్రాంజ్ మెడల్ పోరులో జపాన్ను ఓడించి భారత్ కాంస్యం గెలిచింది.