న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల సెయిలింగ్ విభాగంలో భారత్కు మరో పతకం దక్కింది. మెన్స్ డింగీ ILCA-7 ఈవెంట్లో 24 ఏళ్ల భారత సెయిలర్ విష్ణు శరవణన్ 34 స్కోర్తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. సింగపూర్ సెయిలర్ లో జున్ హాన్ ర్యాన్ గోల్డ్ మెడల్, దక్షిణకొరియా సెయిలర్ జీమిన్ రజతం సొంతం చేసుకున్నారు.
అంతకుముందు మంగళవారం ఉదయం భారత్కు చెందిన 17 ఏళ్ల సెయిలర్ నేహా థాకూర్ (Neha Thakur) ఐఎల్సీఏ-4 ఈవెంట్లో 32 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. థాయిలాండ్కు చెందిన నొప్పసొరన్ కున్బూంజన్ టాప్ స్కోర్తో స్వర్ణ పతకం గెలువగా, సింగపూర్కు చెందిన కీరా మేరీ కార్లైల్ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
అదేవిధంగా మెన్స్ విండ్ సర్ఫర్ RS:X (windsurfer RS:X) ఈవెంట్లో మరో సెయిలర్ ఇబాద్ అలీ పతకం సాధించాడు. రేసులో 52 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నాడు.