Lovlina Borgohain: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇప్పటికే రెండు పతకాలు దక్కగా మరో పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్లో అడుపెట్టింది. ఆసియా క్రీడల్లో ఫైనల్కు చేరడం ద్వారా ఆమె 2024లో జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖాయం చేసుకున్నట్లయ్యింది.
బాక్సింగ్లో ఒలింపిక్స్ పతక విజేత, ప్రపంచ చాంపియన్ అయిన లవ్లీనా మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో థాయ్లాండ్ బాక్సర్ బాయ్సన్ మనీకోన్పై విజయం సాధించి బుధవారం జరగనున్న ఫైనల్స్కు చేరింది. ఇక 19 ఏళ్ల ప్రీతి పవార్ కూడా ఇవాళ జరిగిన 54 కేజీల బాక్సింగ్ సెమీస్లో ఓడి కాంస్యం అందుకుంది. సెమీస్కు చేరడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖాయం చేసుకుంది.