Asia Cup 2023 : ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దాంతో, టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ టోర్నమెంట్ భవితవ్యం ఏంటి? అనే సందేహాలు చాలమందికి ఉన్నాయి. అయితే.. త్వరలోనే ఒక క్లారిటీ రానున్నట్టు సమాచారం. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అత్యవసర సమావేశంలో ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే శనివారం బహ్రెయిన్లో జరగనున్న ఈ సమావేశానికి పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజం సేథీ పిలుపునిచ్చాడు. దుబాయ్లో జరగనున్న ఐఎల్టీ 20 ప్రారంభ వేడుకల సందర్భంగా ఏఆసియా కప్ వేదికపై ఒక అంగీకారానికి రావాలని ఏసీసీ చీఫ్, ఇతర సభ్యులను నజం సేథీ కోరనున్నాడు. దాంతో రేపు జరగబోయే ఏసీసీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నెలకొంది.
జై షా వ్యాఖ్యలతో..
ఆసియా కప్ నిర్వహణపై సందిగ్దత నెలకొనడానికి ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యలే కారణం. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆయన 2023 ఆసియా కప్కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం లేదని, తటస్థ వేదిక మీద టోర్నమెంట్ జరగుతుందనిస్పష్టం చేశాడు. దాంతో, జై షా వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పటి పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజాతో పాటు పలువురు పాక్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే భారత్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్లో తమ జట్టు ఆడదని తెలిపారు. పోయిన ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇచ్చింది. దాంతో, ఈ ఏడాది కూడా ఆ దేశంలోనే ఈ టోర్నమెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్యే ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు నిర్వహించిన ఖతర్ కూడా ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యిం ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోంది.