IND vs PAK | న్యూఢిల్లీ: ఆసియాకప్ వేదికలపై నెలకొన్న సందిగ్ధతలు క్రమంగా తొలిగిపోతున్నాయి. ఆగస్టు 31 నుంచి మొదలయ్యే ఆసియాకప్లో వేదికలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ వేదికల విషయంలో భారత్, పాక్ పట్టువిడుపులకు పోతున్నాయి.
అయితే బీసీసీఐ కార్యదర్శి జైషా, పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ జాకా అష్రఫ్ మధ్య భేటిలో షెడ్యూల్ ఖరారైనట్లు ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ పేర్కొన్నాడు. షెడ్యూల్ను అనుసరించి భారత్, పాక్ మధ్య మ్యాచ్ దంబుల్లా(శ్రీలంక)లో జరుగనుండగా, పాక్ నాలుగు మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది.