IND vs ENG 5th Test : ఇంగ్లండ్తో ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు(Team India) విజయానికి చేరువైంది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తిప్పేయడంతో సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి స్టోక్స్ సేన 5 వికెట్ల నష్టానికి 103 రన్స్ కొట్టింది. జో రూట్(34) క్రీజులో ఉన్నాడు. ఇంకా ఇంగ్లండ్ 156 పరుగులు వెనకబడి ఉంది.
It’s Lunch on Day 3 of Dharamsala Test!
A brilliant First Session with the ball for #TeamIndia! 👌 👌
Stay Tuned for Second Session! ⌛️
Scorecard ▶️ https://t.co/jnMticF6fc#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/mo96MWtCzO
— BCCI (@BCCI) March 9, 2024
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటయ్యింది. కుల్దీప్ యాదవ్ను ఔట్ చేసి జేమ్స్ అండర్సన్ 700 వికెట్ సాధించాడు. షోయబ్ బషీర్ రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత టాపార్డర్ (Top Order) అరుదైన ఫీట్ సాధించింది. ఏకంగా ఐదుగురికి ఐదుగురు హాఫ్ సెంచరీపైనే స్కోర్ చేశారు. యశస్వీ జైస్వాల్(57), రోహిత్ శర్మ(103), శుభ్మన్ గిల్(110), దేవ్దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56)లు ఫిఫ్టీలు బాదారు. భారత క్రికెట్ చరిత్రలో టాపార్డర్ ఈ రేంజ్లో ఆడడం ఇది నాలుగోసారి.