బెంగళూరు: దిగ్గజ కెప్టెన్ కపిల్దేవ్ రికార్డును అధిగమించడం చాలా సంతోషంగా ఉందని టీమ్ఇండియా స్టార్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. చిన్నప్పుడు కపిల్దేవ్లాగా మీడియం పేస్ ఆల్రౌండర్ కావాలనుకున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. శ్రీలంకతో తొలి టెస్టులో కపిల్దేవ్ (434) వికెట్ల రికార్డును అశ్విన్ (436) దాటేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘28 ఏండ్ల క్రితం ‘కపిల్ పాజీ’.. రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును బద్దలు కొట్టినప్పుడు మా నాన్నగారితో కలిసి గంతులేశా. ఎనిమిదేండ్ల వయసులో నేనెప్పుడూ కపిల్ పాజీ రికార్డును అధిగమిస్తానని ఊహించలేదు. ఎందుకంటే అప్పట్లో నేను బ్యాటర్ అవ్వాలనుకున్నా. మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేస్తూ.. మరో ‘కపిల్ పాజీ’ అవుదామనుకున్నా’ అని అన్నాడు.