IND vs ENG 1st Test: భారత్ – ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ – రవీంద్ర జడేజాలు అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ కలిసి టెస్టులలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జోడీగా అవతరించారు. ఉప్పల్ టెస్టులో ఈ ఇద్దరూ తలా మూడు వికెట్లు తీశారు. తద్వారా టెస్టులలో ఈ జోడీ కలిసి 506 వికెట్లను సాధించింది. దీంతో టెస్టులలో జంబో (కుంబ్లే) – భజ్జీ (హర్భజన్)లు గతంలో సాధించిన 501 వికెట్ల రికార్డు (56 టెస్టులలో) ను యాష్ – జడ్డూలు అధిగమించారు.
భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన జోడీలో అగ్రస్థానం సాధించిన అశ్విన్ – జడేజా ద్వయం.. 50 టెస్టులలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. 506 వికెట్లలో అశ్విన్ 277 వికెట్లు తీయగా జడ్డూ 229 వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో అత్యధిక వికెట్లు తీసిన పెయిర్గా ఇంగ్లండ్ పేస్ పెయిర్.. జేమ్స్ అండర్సన్ – స్టువర్ట్ బ్రాడ్ లు ముందున్నారు. అండర్సన్ – బ్రాడ్లు 139 మ్యాచ్లలో 1,039 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ దిగ్గజ బౌలర్లు షేన్ వార్న్ – గ్లెన్ మెక్గ్రాత్లు 104 మ్యాచ్లలో 1,001 వికెట్లు పడగొట్టారు.
The Greatest spin duo in Test cricket.
– Ashwin & Jadeja. 🐐👑 pic.twitter.com/fU5ZdVYT3B
— Johns. (@CricCrazyJohns) January 25, 2024
ముత్తయ్య మురళీధరన్ – చమిందా వాస్లు కలిసి 895 వికెట్టు పడగొట్టారు. విండీస్ మాజీ పేసర్లు కోట్నీ వాల్ష్ – కర్ట్లీ అంబ్రోస్లు 762 వికెట్లు తీశారు. పాకిస్తాన్ స్వింగ్ సుల్తానులు వసీం అక్రమ్ – వకార్ యూనిస్ల జోడీ 599 వికెట్లు దక్కించుకున్నారు.