Womens Ashes Series : మహిళల యాషెస్ సిరీస్ ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా(Australia) జట్టు భారీ విజయం సాధించింది. ఆల్రౌండర్ అష్ గార్డ్నర్(Ashleigh Gardner) 8 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్పై అద్భుత విజయం నమోదు చేసింది. ఆతిథ్య జట్టుపై 89 పరుగుల తేడాతో గెలుపొందింది. గార్డ్నర్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 178 పరుగులకే కుప్పకూలింది. దాంతో, ఆసీస్ మహిళల జట్టు సంబురాల్లో మునిగి తేలింది. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో జట్టును గెలిపించిన గార్డ్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికైంది.
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 473 రన్స్ కొట్టింది. ధనాధన్ ఆడిన ఎలిసా పెర్రీ(99) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. ఆ తర్వాత.. 8వ స్థానంలో వచ్చిన సథర్లాండ్(137) రికార్డు శతకంతో ఆసీస్కు భారీ స్కోర్ అందించింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ దీటుగా బదులిచ్చింది.
Look at ‘em pic.twitter.com/5GpA3g9rFd
— Australian Women’s Cricket Team 🏏 (@AusWomenCricket) June 26, 2023;
టమ్మీ బ్యూమొంట్(208) డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్కు కేవలం 10 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఎక్లిస్టోన్ 5 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 257కు ఆలౌటయ్యింది. 268 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆఫ్ స్పిన్నర్ గార్డ్నర్ దెబ్బకు ఐదోరోజు ఇంగ్లండ్ బ్యాటర్లు వచ్చనవాళ్లు వచ్చినట్టే పెవిలియన్కు క్యూ కట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డానియల్ వయట్ (54) మాత్రమే అర్ధ సెంచరీతో రాణించింది. అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న గార్డ్నర్ రెండు ఇన్నింగ్స్ల్లో12 వికెట్లు తీయడం విశేషం.