Ashes | యాషెస్ సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతోంది. మ్యాచ్ రెండో రోజు స్టీవ్ స్మిత్ రనౌట్ నిర్ణయంపై పెను దుమారం చెలరేగింది. అయితే, భారత్కు చెందిన అంపైర్ నితిన్ మీనన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిపుణులు, అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇండోర్ అంపైర్ నిర్ణయాన్ని భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం నిర్ణయాన్ని ప్రశంసించాడు. ఓవర్లో జరుగుతున్న మ్యాచ్లో భాగంగా శుక్రవారం రెండోరోజు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
78వ ఓవర్లో క్రిస్ వోక్స్ వేసిన మూడో బంతిని స్మిత్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడి.. రెండు పరుగులు తీసుసేందుకు ప్రయత్నించాడు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఇల్హామ్ బంతిని క్యాచ్ చేసి.. వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో వైపు విసిరాడు. బెయిర్స్టో బంతితో స్టంప్స్ను పడగొట్టాడు. అయితే, మొదటగా స్మిత్ రనౌట్ అయినట్లుగా కనిపించింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాలు సంబురాలు చేసుకుంటుండగా.. మ్యాచ్కు థర్డ్ అంపైర్గా వ్యవహరిస్తున్న నితిన్ మీనన్ స్మిత్ను నాటౌట్గా ప్రకటించారు. రనౌట్ను చాలాసార్లు రీప్లే చూసి.. బంతి వికెట్లను తాకే ముందే.. స్మిత్ బ్యాట్ క్రీజులోకి చేరడంతో నాటౌట్గా ప్రకటించాడు.
స్మిత్ను నాటౌట్గా ఇవ్వడంతో ఇంగ్లిష్ అభిమానులు నిరాశకు గురవగా.. ఆస్ట్రేలియా అభిమానులు సంబురాలు చేసుకున్నారు. దీనిపై భారత స్పిన్నర్ అశ్విన్ స్పందిస్తూ.. స్టీవ్ స్మిత్ రనౌట్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్ స్పందించిన తీరు అద్భుతమని ప్రశంసించాడు. అన్ని కోణాల్లో పరిశీలించి సరైన నిర్ణయమే తీసుకున్నాడని, నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేం అంటూ ట్వీట్ చేశాడు. మరో వైపు ఈ వ్యవహారంపై ఎంసీసీ వివరణ ఇచ్చింది. స్మిత్ది రనౌట్ కాదని, ఎంసీసీ చట్టం 29.1 ప్రకారం.. వికెట్పై నుంచి కనీసం ఒక బెయిల్, గ్రౌండ్పై కనీసం ఒక స్టంప్ అయినా తొలగితేనే వికెట్ పడినట్లుగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది.