AI Pics | హైదరాబాద్: అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. చాట్ జీపీటీ ఇప్పటికే సాంకేతికంగా సంచలనం సృష్టిస్తుంటే ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తున్నది. మనమెంతో ఇష్టపడే అభిమాన క్రికెటర్లు అమ్మాయిల్లా మారితే ఎలా ఉంటుందో ఆలోచించండి.
సరిగ్గా ఇదే పంథాతో ఏఐ మిడ్జానీ టెక్నాలజీని వినియోగిస్తూ ఆర్టిస్ట్ అబు సాహిద్ రూపొందించిన చిత్రాలు ఇప్పుడు సోషల్మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విరాట్ కోహ్లీ..విద్యా కోహ్లీగా, శుభ్మన్ గిల్ కాస్తా సుభద్ర గిల్గా, మహేంద్రసింగ్ ధోనీ..మహీసింగ్ ధోనీగా మార్చిన ఫొటోలు వైరల్గా మారాయి. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, గంభీర్, యువరాజ్సింగ్, రోహిత్శర్మ, జడేజా, ధవన్, రిషబ్ పంత్ ఫొటోలను సాహిద్ అద్భుతంగా తీర్చిదిద్దాడు.