హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచలోని ప్రఖ్యాత క్రికెట్ మైదానాలను పరిశీలించి వాటికి దీటుగా.. ఉప్పల్ స్టేడియంను తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. ఉప్పల్ మైదానాన్ని నవీకరించే ముందు ప్రపంచంలోని అధునాతన క్రికెట్ మైదానాలను పరిశీలించి అధ్యాయనం చేస్తామన్నారు.
ఇందులో భాగంగా శనివారం కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను జగన్మోహన్ రావు సందర్శించారు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు స్నేహాశీష్ గంగూలీతో భేటీ అయ్యారు. మైదానం అభివృద్ధికి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల సమయంలో పిచ్ను ఆరబెట్టడానికి ఎలాంటి పద్ధతులు వినియోగిస్తున్నారని కనుక్కున్నారు.