బాకు(అజర్బైజాన్): ఫిడే ప్రపంచచెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. జీఎం ఆర్ ప్రజ్ఞానందతో అర్జున్ క్వార్టర్స్ గేమ్ టైబ్రేక్కు దారితీసింది. ఇద్దరు చెరో గేమ్ గెలువడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. గురువారం ఇద్దరి మధ్య నిర్ణయాత్మక పోరు జరుగనుంది. మరోవైపు జీఎంలు గుకేశ్, విదిత్ గుజరాతీ ఓటములతో మెగాటోర్నీ నుంచి నిష్క్రమించారు.