బీజింగ్: ఈ ఏడాది వింటర్ ఒలింపిక్స్ చైనాలో శుక్రవారం గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. అయితే భారత్ నుంచి ఒకే ఒక అథ్లెట్ ప్రాతినిధ్యం వహించారు. బీజింగ్లోని బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో ఆరిఫ్ ఖాన్ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆయన చేతపట్టుకున్నారు. జమ్ముకశ్మీర్కు చెందిన 31 ఏండ్ల ఆరిఫ్ ఖాన్, ఆల్పైన్ స్కీయర్. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లలో ఆయన పోటీ చేయనున్నారు.
బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన అభినవ్ బింద్రా, వింటర్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆరిఫ్ ఖాన్ను ప్రశంసించారు. ‘కశ్మీర్ నుంచి ఒలింపిక్స్ వరకు! 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక అథ్లెట్ ఆరిఫ్ ఖాన్, త్రివర్ణ పతాకాన్ని మోస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
కాగా, రెండేళ్ల కిందట లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయ వద్ద భారత్, చైనా మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇందులో గాయపడిన చైనా సైనికుడికి ఒలింపిక్ జ్యోతిని తీసుకెళ్లే గౌరవాన్ని చైనా ఇవ్వడంపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధులను వింటర్ ఒలింపిక్స్కు పంపబోమని తెలిపింది. మరోవైపు చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ను పలు పశ్చిమ దేశాలు బహిష్కరించాయి.
From Kashmir to the Olympics! Really proud to see #ArifKhan, the only athlete representing India at #Beijing2022 carry the tricolor high! pic.twitter.com/n3YGVsVsMd
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) February 4, 2022
The opening ceremony of the Beijing 2022 Winter Olympic Games begins at the National Stadium, also known as the Bird's Nest on February 4. The 31-year-old Alpine skier Arif Khan, the only entry from India, will compete in the Slalom and Giant Slalom events of the Beijing Olympics pic.twitter.com/OqfoL0ZYrb
— Rabi Sankar Bosu (@BosuRabi) February 4, 2022