Argentina | ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకుంది అర్జెంటీనా జట్టు. ఫుట్బాల్ ఆటగాళ్లు అభిమానులతో కలిసి సంబురాలు చేసుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మెస్సీతో సహా కీలక ఆటగాళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఫుట్బాల్ టీమ్ పాల్గొన్నది. నగరంలో పర్యటిస్తున్న సమయంలో.. మెస్సీతో సహా ఐదుగురు ఆటగాళ్లు ట్రోఫీతో బస్ టాప్పై కూర్చుతున్నారు. ఈ క్రమంలో ఓ విద్యుత్ తీగ ఆటగాళ్లకు అడ్డుగా వచ్చింది. మొదట్లో తీగలను గమనించలేదు. మరింత దగ్గరకు రాగా.. గమనించిన ఓ ఆటగాడు.. మిగతా వారందరినీ అప్రమత్తం చేశాడు.
చివరి క్షణంలో ఆటగాళ్లంతా కిందకు వంగడంతో ప్రమాదం తప్పినట్లయింది. అయితే, విద్యుద్ఘాతం సంభవించే ప్రమాదం లేకపోయినా.. వైర్లు తగిలితే కిందపడిపోయే ప్రమాదం ఉండేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. బ్యూనస్ ఎయిర్స్లో అర్జెంటీనా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. బస్లో ఆటగాళ్లంతా విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఆటగాళ్లందరూ ట్రోఫీతో పాటు ఓపెన్ బస్ నుంచి అభిమానులకు ట్రోఫీని చూపిస్తూ సందడి చేశారు.
Messi and his teammates had a close miss here 😳 pic.twitter.com/nQtNwE9Cpc
— ESPN FC (@ESPNFC) December 20, 2022