బ్రిసిలియా (బ్రెజిల్): కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నీలో మెగాఫైట్కు రంగం సిద్ధమైంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా సెమీస్లో గెలిచి బ్రెజిల్తో టైటిల్ సమరానికి చేరింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీస్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ ద్వారా 3-2 తేడాతో కొలంబియాను ఓడించింది. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మర్టినెజ్ షూటౌట్లో మూడుసార్లు బంతి గోల్పోస్ట్కు వెళ్లకుండా ఆపి జట్టును గెలిపించాడు. మ్యాచ్లో ఏడో నిమిషంలోనే లాటారో మార్టినెజ్ గోల్ బాదడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో అర్ధబాగంలో కొలంబియా ప్లేయర్ లూయిస్ డియాజ్ (61వ ని.) గోల్తో స్కోర్లు సమమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ తప్పనిసరైంది. అర్జెంటీనా తరఫున మొదట మెస్సీ ఖాతా తెరువగా.. రెండో అవకాశాన్ని రెండు జట్లు చేజార్చుకున్నాయి. మెస్సీసేన ఆ తర్వాత రెండు సార్లు స్కోర్ చేసింది. ఈ క్రమంలో కొలంబియా ప్లేయర్లు కొట్టిన బంతులను ఎమిలినో రెండుసార్లు అద్భుతమైన డైవ్లతో ఆపడంతో అర్జెంటీనా గెలిచింది.