ముంబై: ఐపీఎల్ విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన హీరోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగిన రీతిలో గౌరవించింది. వారి సేవలకు గుర్తింపునిస్తూ రూ.కోటి 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్ విజయవంతంగా సాగడంలో క్యూరేటర్లు, గ్రౌండ్మెన్స్ తదితరులు దోహదం చేశారు.
ఈ సందర్భంగా వారి సేవలను బోర్డు కార్యదర్శి జైషా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ‘మ్యాచ్లు అద్భుతంగా నిర్వహించిన వారికి రూ.1.25లక్షలు నగదు బహుమతి ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ సీజన్లో ఆరు వేదికల్లో తెరవెనుక హీరోలు ఎవరంటే మా క్యూరేటర్లు, గ్రౌండ్మెన్స్’ అని జై షా తెలిపాడు.
సీసీఐ, పుణె, వాంఖడే, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో పని చేసినవారికి రూ.25 లక్షలు, ఈడెన్ గార్డెన్స్, మోదీ స్టేడియంలో పని చేసిన వారికి రూ.12.5 లక్షలు ప్రకటించింది. గ్రౌండ్మెన్లకు బోర్డు నగదు బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారి.