Narra Lakshmi Swarajyam | రవీంద్రభారతి, ఏప్రిల్ 2: లాస్వేగాస్(అమెరికా) వేదికగా జరిగిన అమెరికా ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో ఏపీకి చెందిన నర్రా లక్ష్మిస్వరాజ్యం స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 50 ఏండ్ల వయసు కటా నాంచాక్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. మరోవైపు పురుషుల కేటగిరీలో రవి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలలో 29 దేశాల నుంచి రెండు వేల మంది ప్లేయర్లు పాల్గొన్నట్లు లక్ష్మి పేర్కొంది. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ద్వారా వివిధ రంగాలకు చెందిన మహిళలకు, పోలీసు శాఖలో శిక్షణ అందిస్తున్నానని తెలిపింది.