కోరుట్ల రూరల్, డిసెంబర్ 28: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లి గ్రామానికి చెందిన ఏనుగు అన్వేష్రెడ్డి లాయర్స్ క్రికెట్ ప్రపంచకప్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఈ నెల 28 నుంచి 6 వరకు కోలంబో (శ్రీలంక)లో జరిగే లాయర్స్ క్రికెట్ ప్రపంచ కప్లో ఆడనున్నారు.
ఈ ప్రపంచకప్ టోర్నీలో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్తో పాటు కామన్వెల్త్ జట్లు తలపడనున్నట్లు అన్వేష్రెడ్డి తెలిపారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ క్రికెట్ టీం వైస్ కెప్టెన్గా అన్వేష్రెడ్డి వ్యవహరిస్తున్నారు.